ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహారదీక్ష చేపట్టిన నవంబరు 29వ తేదీ సందర్భంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీనటుడు సుమన్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం రాదని ఎంతో మంది అన్నారని.. అయితే, కేసీఆర్ ఆనాడు దీక్ష చేపట్టడంతో ప్రజల కల నెరవేరిందని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడటంతో అక్కడ ఏపీలోనూ అభివృద్ధి ప్రారంభమైందని వ్యాఖ్యాని