తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం తమిళ్ కంటే కూడా తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమాలలో నటించి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా రూపొందిన తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ వరలక్ష్మి మాత్రం తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈమెకు తెలుగు లో వరుస అవకాశాలు పెరిగాయి.

అలాగే ఈమె తెలుగు లో ఎక్కువ శాతం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ శబరి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఇక సినిమా విషయం కాసేపు పక్కన పెడితే ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి గురించి అనేక ట్రోల్స్ చేస్తున్నారు అనే విషయంపై ఈమె గట్టిగా స్పందించింది.

తాజాగా వరలక్ష్మి మాట్లాడుతూ ... నేను నికోలయ్ సచ్ దేవ్ ను డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం లేదు. ప్రస్తుతం నా చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. వాటి ద్వారా నాకు చాలా డబ్బు వస్తుంది. నా కెరియర్ ఇంకా పిక్స్ లోనే ఉంది. మరి కొంత కాలం కూడా నేను భారీగా సంపాదించగలను. అలాంటప్పుడు నేను డబ్బు కోసం ఎందుకు పెళ్లి చేసుకుంటా. నికోలయ్ సచ్ దేవ్ తన మొదటి భార్యతో కలిసి ఉన్న సమయం లోనే నాకు పరిచయం. ఆయన ప్రవర్తన , మర్యాద చూసి నాకు అతనిపై ప్రేమ కలిగింది. నా కళ్ళకు ఆయన ఎప్పుడు హీరోలనే కనబడుతాడు. అనవసరంగా మా గురించి తప్పుడు వ్యాఖ్యలు రాయకండి అని వరలక్ష్మి స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: