తెలుగు చిత్ర పరిశ్రమల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో ఒకరు నాగచైతన్య -సమంత ఒకరు.తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఆయన పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అప్పటివరకు మంచి హీరో అనిపించుకున్న నాగచైతన్య హ్యూజ్ ట్రోలింగ్ ఫేస్ చేయడమే కాకుండా భారీ నిందలు కూడా మోసాడు.అయితే నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ నాగచైతన్య మొండితనమే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . తాజాగా నాగచైతన్య మోసం చేశాను అంటూ చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసాయి. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మాట్లాడిన మాటలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు .

శైలజా రెడ్డి అల్లుడు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ అను ఇమాన్యుల్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు నాగ చైతన్య.మీరు ఎప్పుడైనా రిలేషన్‌షిప్‌లో మోసం చేశారా అని యాంకర్ ప్రశ్నించగా..దీనికి హీరోయిన్ అను ఇమాన్యుల్‌ నేను ఎప్పుడు మోసం చేయలేదంటూ సమాధానం ఇచ్చింది. నాగ చైతన్య మాత్రం తాను రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు మోసం చేశానని సమాధానం ఇస్తాడు. నాగ చైతన్య అక్కడితో ఆగకుండా ప్రతి ఒక్కరూ జీవితంలో అన్ని అనుభవించాలి.మొత్తానికి ఎవరో పనీపాటా లేని బ్యాచ్ నాగచైతన్య పై ట్రోలింగ్ చేయడానికి ఎప్పుడెప్పుడు ఏ వీడియో బయటపడుతుందని కాచుకొని కూర్చొని ఉన్నారు అని చెప్పడానికి ఇదే ది బెస్ట్ ఉదాహరణ.ప్రజెంట్ నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అంతేకాదు విరుపాక్ష సినిమా డైరెక్టర్ తో కూడా ఒక క్రేజీ ప్రాజెక్టు ఫైనలైజ్ చేసాడట . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే చూస్ చేసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: