తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో క్రిష్ జాగర్లమూడి ఒకరు. ఈయన శర్వానంద్ , అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో రూపొందిన గమ్యం మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈయనకు తెలుగు పరిశ్రమలో సూపర్ గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన పవన్ కళ్యాణ్ హీరో గా హరిహర వీరమల్లు అనే మూవీ ని ప్రారంభించాడు. ఈ మూవీ కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత పవన్ "భీమ్లా నాయక్" మూవీ పై ఇంట్రెస్ట్ చూపించడంతో క్రిష్ "కొండ పోలం" అనే మూవీ ని స్టార్ట్ చేసాడు. ఇలా వీరిద్దరూ హరిహర వీరమల్లు మూవీ ని పక్కన పెట్టేసి తమ తమ సినిమా లతో ఫుల్ బిజీ అయ్యారు.

ఆ తర్వాత మళ్లీ ఈ సినిమాను ప్రారంభించారు. మళ్ళీ కొంత భాగం షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా ఆగిపోయింది. దానితో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఇక క్రిష్ అనుష్క ప్రధాన పాత్రలో ఓ మూవీ ని చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు మూవీ సినిమా ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశాలు లేనందున క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు దానితో వేరే దర్శకుడి తో ఈ మూవీ మిగిలిన భాగాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ "ఘాటి" అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఇందులో అనుష్క వృద్ధురాలు పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో సత్యం రాజేష్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: