ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన క్యాబినెట్ లో ఉండే కొందరు మంత్రులు ప్రజల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. బహిరంగంగానే అక్రమాలకు పాల్పడుతూ తమకు ఎదురే లేనట్టుగా ప్రవర్తిస్తూ ఎప్పుడూ చర్చల్లో నిలుస్తున్నారు . ఇకపోతే జగనోరు.. క్యాబినెట్ లో ఉండే మంత్రుల భాష సరళి కూడా ప్రజలకు విసుగు తెప్పిస్తుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ బూతు పురాణం జపిస్తున్నారు కొందరు మంత్రులు. ఆలోచన లేని కామెంట్స్ చేస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెడుతున్నారు.

ముఖ్యంగా కొందరి మంత్రుల విధానము, వారు ప్రజల్లో ఉన్నప్పుడు చేసే కామెంట్స్ జగనోరు కి.. తీవ్ర తలనొప్పి గా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వైసీపీ నాయకులు మాట్లాడే మాటల పై సోషల్ మీడియాలో అనేక విధమైన ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీ నాయకులలో ఎలాంటి మార్పు రావడంలేదు. వారు  ప్రజల్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా తమ నోటికి పని చెబుతూ ఎప్పుడూ చర్చల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలను ఎదుర్కొనే సందర్భంలో సహనం కోల్పోయి బూతు పురాణాలు వల్లిస్తున్నారు.

ప్రతిపక్షాల నుండి వచ్చే విమర్శలను సలహాలు గా తీసుకుని రాష్ట్రాన్ని  అభివృద్ధి పథంలో నడపవలసిన మంత్రులు బూతులు వల్లించడం సరైన ఈ విధానం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  మరి జగనోరు ఆ మంత్రులపై చర్యలు తీసుకోకపోతే తన ప్రభుత్వానికి కాక పార్టీ కూడా చాలా నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే కొందరి మంత్రులపై ప్రజలు తీవ్ర అసహనంగా ఉన్నారనేది కాదనలేని వాస్తవం. ఏది ఏమైనప్పటికీ మరి ఆ మంత్రులు తమ వైఖరి మార్చుకున్నారు లేక అలాగే కొనసాగుతారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: