చివరి బాల్ వరకు ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇక చివర్లో రవీంద్ర జడేజా చెలరేగి ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 12 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో రవీంద్ర జడేజా క్రీజు లోకి వచ్చాడు.. అయితే ఆ సమయంలో క్రీజ్లో ఉన్న జడేజా సామ్ కరణ్ లు తొలి నాలుగు బంతుల్లో 7 పరుగులు రాబట్టారు. దీంతో సమీకరణం కాస్త 8 బంతుల్లో 23 పరుగులు గా మారిపోయింది. అప్పటివరకు మ్యాచ్ మొత్తం కోల్కతా చేతుల్లోనే ఉంది.
ఇదే సమయంలో 19వ ఓవర్లో అయిదో బంతిని హై ఫుల్ టాస్ రూపంలో ఫెర్గ్యూసన్ సంధించాడు. దీంతో ఆ బంతికి జడేజా రెండు పరుగులు రాబట్టారు. అంపైర్ నో బాల్ గా ప్రకటించాడు. ఇక ఆ తర్వాత ప్రీహీట్ బంతిని జడేజా సిక్స్ గా మరిచాడు. ఆఖరి బంతికి ఫోర్ బాదేశాడు. కేవలం చివరి రెండు బంతుల్లోనే 13 పరుగులు సమర్పించుకున్నాడు ఫెర్గ్యూసన్. దీంతో ఆ తర్వాత ఓవర్లో ఆరు బంతుల్లో 10 పరుగులు గా మారిపోయింది సమీకరణం. ఇక అప్పటికే వరుసగా సిక్సర్లు బాదిన రవీంద్ర జడేజా ఎంతో సునాయాసంగా చెన్నై సూపర్ కింగ్స్ కీ విజయం అందించాడు.