భారత్ వర్సెస్ పాకిస్తాన్.. ఈ మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా ప్రపంచం చూపు మొత్తం ఈ మ్యాచ్ పైనే ఉంటుంది...  ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు  ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారు అనేదానిపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. క్రికెట్ ప్రపంచాన్ని  మొత్తం ఆకర్షించే హై వోల్టేజీ మ్యాచ్ గా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పేరు తెచ్చుకుంటుంది అనే విషయం తెలిసిందే.ఈ 20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా జట్టు మొదటి మ్యాచ్లోనే చిరకాల ప్రత్యర్థి  పాకిస్థాన్ ను ఎదుర్కోబోతోంది. కాగా నేడు ఈ మ్యాచ్ జరగబోతోంది. నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.



 కాగా ఇప్పటికే నేడు జరగబోయే మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా తమ జట్టు ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాను ఒకసారి గమనిస్తే టీమిండియా యువ ఆటగాళ్లతో రంగంలోకి దిగుతుంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు మాత్రం సీనియర్లు అందర్నీ కూడా జట్టులోకి చేర్చుకుని వారి అనుభవంతోనే ఈసారి టీమిండియా పై విజయం సాధించాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం టీమిండియాతో తలపడపోతున్న పాకిస్తాన్ జట్టులోని ఆటగాళ్లు భార్యలకు ఇండియా తో కొన్ని లింకులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


 ప్రస్తుతం టి20 క్రికెట్ లో ముఖ్యమైన ప్లేయర్గా.. పాకిస్థాన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ అయిన సానియా మీర్జా తెలుగు రాష్ట్రానికి చెందినది కావడం గమనార్హం. కాగా సానియా మీర్జా 2010లో షోయబ్ మాలిక్ ను ప్రేమ వివాహం చేసుకుంది.
 పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ వసీం భార్య సానియా అష్ఫాక్ ఇంగ్లాండ్కు చెందిన వేల్స్ లో జన్మించింది. అయితే ఈమెకు భారత్ మూలాలు కూడా ఉండటం గమనార్హం. ఈమె తల్లిదండ్రులు భారత్కు చెందిన వారే కావడం గమనార్హం. ఈమె కూడా సోషల్ మీడియా లో ఎంతో క్రేజ్ సంపాదించింది. అయితే ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో  ఇమాద్ వసీం తో కలిసింది.  ఇక వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది.

 41 ఏళ్ల పాకిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ ఆఫీస్ ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఎంపిక చేసిన 15 మంది సభ్యులలో సభ్యులలో ఒకరుగా కొనసాగుతున్నాడు. అయితే సీనియర్ క్రికెటర్ భార్య పేరు నాజియా. వీరిద్దరూ 2007వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అయితే నాజియా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇక పాకిస్తాన్ మ్యాచ్ ల సమయంలో నాజీయా ఎన్నోసార్లు స్టేడియంలో కనిపించింది.
 పాకిస్థాన్ జట్టులో ముఖ్యమైన బౌలర్ గా ఉన్నా హసన్ అలీ భార్య భారత సంతతికి చెందినదే కావడం గమనార్హం. హాసన్ అలీ రెండు సంవత్సరాల కిందట మేవాట్ నివాసి అయిన శమియా అర్జుని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈమె ఎయిర్ ఎమిరేట్స్లో ఫ్లైట్ ఇంజనీర్. ఈమెని ప్రేమించిన పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ ఎంతో కష్టపడి పెద్దలను ఒప్పించి మరీ 2019లో వివాహం చేసుకున్నాడు.

 షహీన్ షా ఆఫ్రిది ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో యువ సంచలనం గా కొనసాగుతున్నాడు. అయితే ఇతనికి కాబోయే భార్య పేరు ఆక్స్ ఆఫ్రిదీ. పాకిస్తానీ లెజెండరీ ఆల్రౌండర్ అయినా షాహిద్ అఫ్రిది కుమార్తె. వీరిద్దరూ ఎన్నో రోజుల పాటు ప్రేమలో మునిగితేలారు. ఇక ఇప్పుడు పెద్దల అంగీకారంతో మరి కొన్ని రోజుల్లో పెళ్లి కి ఏదో ఒకటి కాబోతున్నారు. ఈమె విరాట్ కోహ్లీ కి పెద్ద ఫ్యాన్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: