బుల్లి తెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న డైలీ సీరియల్ కార్తీక దీపం.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరిని కట్టిపడేసింది. వంటలక్క , డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారు. వారిద్దరూ కలిసిన తర్వాత సీరియల్ అయిపోతుందా లేక మరో మలుపు తిరుగుతుందా అనేది తెలుగు ప్రేక్షకులకు ఆసక్తిగా మారింది. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒక ట్విస్ట్ ను కలిగిస్తుంది. దీని వల్ల సీరియల్ రేటింగ్ భారీగా పెరిగింది.



అయితే రేపటి ప్రోమోలో మాత్రం అంజీ దీపని మళ్లీ కలుస్తాడు. దీపకు మొత్తం జరిగిన నిజాన్నంతా కళ్లుముందు పెడతాడు. మౌనిత నేర చరిత్రను వివరిస్తూ.. అప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్పేస్తాడు. మొత్తానికి దీప కాపురం నిలబెట్టుకోవడానికి ఓ మార్గం దొరకబోతుంది.కార్తీక్, హిమల ప్రేమ, కార్తీక్ హిమల యాక్సిడెంట్ గురించి గుర్తు చేసుకుంటూ.. దీపకు నిజాన్ని చెప్పేస్తాడు. ‘ఆ హిమ చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదమ్మా.. నేను చంపేశాను.. ఆ పాపాత్ముడ్ని నేనే..’ అంటూ ప్రశ్చాత్తాపంతో కుమిలిపోతూ చెబుతాడు. అయితే దీప ఆ మాట వినగానే.. కాలర్ పట్టుకున్న దీప ఏడుస్తూ.. ‘నువ్వు హిమని చంపేశావా.. అంటూ ఆవేశంగా మారుతుంది.



రేపటి ఎపిసోడ్ లో మాత్రం కాస్త రసవత్తరంగా మారింది..హిమని చంపమని డబ్బు ఇచ్చింది ఆ మౌనితేనమ్మా..’ అంటాడు అంజి బాధగా ఏడుస్తూ. ఆ మాట వినగానే దీప ఆవేశాన్ని ఆపుకోలేక లాగిపెట్టి కొడుతుంది అంజిని. అంతే కోపంతో అంజీని కాలర్ పట్టుకుని.. ‘డబ్బు కోసం ఒక మనిషి ప్రాణం తీస్తావా..అని అడగగా.. ఏడుస్తూ నాది తప్పే అంటూ అంజి దీప కాళ్ళ మీద పడతాడు. దీప అలా చూస్తుండగానే దీప కాళ్ల మీద పడిపోతాడు అంజి. ఆ సీన్ చాలా ఉత్కంఠగా ఉంది. ఇది అంజీ కల కాకుండా.. నిజమైతే మాత్రం సీన్ అదిరిపోతుంది.ఇకపోతే రేపటి ఎపిసోడ్ లో మౌనితకు చుక్కలు చూపించ బోతున్నట్లు తెలుస్తుంది. దీప, కార్తిక్ బాబు కలిసే అవకాశం మరి కొద్దీ రోజుల్లో రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: