రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో గాలోడు వంటి మాస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో హీరోయిన్ గా గేహన సిప్పీ నటించింది. ముఖ్యంగా ఈ సినిమాకు హీరోయిన్ అందాలు ప్లస్ అని చెప్పవచ్చు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా రూ.3 కోట రూపాయల వరకు కలెక్షన్లు సాధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు వచ్చినట్లుగా సమాచారం. ఈ సినిమా సక్సెస్ కావడంతో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి తన ఆనందాన్ని పంచుకుంటూ తన డైరెక్షన్లో మరొక ప్రాజెక్టును ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈసారి ముచ్చటగా మూడవసారి సుదీర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లో రష్మీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇక గతంలో కూడా వీరిద్దరూ బుల్లితెర పైన ఎంత ట్రెండ్ ని సెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుచేతనే ఈ జంటను తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కూడా సీతారామం సినిమాని మించి ఉండబోతోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే గాలోడు సినిమా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చిత్ర బృందం.