అమ్మ అని పిలిపించుకోవడం ఆడవాళ్లకు దేవుడు ఇచ్చిన వరం. నవమాసాలు మోసి బిడ్డకు జన్మ ఇస్తుంది అమ్మ. పుట్టిన వెంటనే బిడ్డ ఏడుపు ఆపడానికి తన స్తన్యాన్ని బిడ్డకు ఇచ్చి బిడ్డ ఆకలి తీరుస్తుంది. అలా బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి బహుమతి తల్లి పాలు మాత్రమే.పిల్లో, పిల్లాడో పుట్టగానే పాలు పట్టే క్షణం వర్ణించలేని అనుభవం. ఆ అనుభవం ప్రతి ఆడది కోరుకుంటుంది. ఆ క్షణం అసలు లోకాన్ని మరిచిపోతామా అనిపిస్తుంది. ఆ అనుభవాన్ని మించిన అనుభవం లేదు.తల్లి పాలు ఇవ్వడం వల్ల ఒక్క బిడ్డకు మాత్రమే మంచిది కాదు.తల్లికి కూడా చాలా మంచిది.కొంతమంది తల్లులు బిడ్డకు పాలు పడితే అందం తగ్గిపోతుంది అని పాలు ఇవ్వకుండా డబ్బా పాలకు బిడ్డని అలవాటు చేస్తారు.కానీ అలా చేయడం వల్ల బిడ్డకి తల్లికి ఇద్దరికి నష్టమే.బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి చాలా మంచిది. అది ఎలాగో చుడండి.




గర్భం ధరించిన స్త్రీ  బిడ్డను ప్రసవించిన తర్వాత పిలల్లకు పాలు పడితే  పెరిగిన బరువు తిరిగి తగ్గే వీలుంటుంది. అలాగే తల్లీ బిడ్డల బంధాన్ని పెంపొందించడంలో తల్లి పాల పాత్ర చాలా ముఖ్యమైనది. మీకు బిడ్డతో గడిపేందుకు చాలా సమయం దొరకడంతో పాటు.. బిడ్డకు కూడా ఎన్నో పోషకాలతో నిండిన పాలు దొరుకుతాయి.బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల చాలా డబ్బు మిగలడంతో పాటు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు బిడ్డకు సరైన ఉష్ణోగ్రతతో ఉన్న పాలు.ఎలాంటి ఇన్ఫెక్షన్ల భయం లేకుండా అందించే వీలుంటుంది.బిడ్డకు పాలు పట్టిన తల్లుల్లో రొమ్ము క్యాన్సర్ అలాగే ఒవేరియన్ క్యాన్సర్లు వచ్చే ముప్పు చాలా తక్కువగా ఉంటుంది.



ప్రసవం తర్వాత బిడ్డలకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చే తల్లుల్లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. పాలు పట్టేటప్పుడు విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్ల వల్లే ఇది సాధ్యమవుతుంది.అలాగే  బిడ్డతో సమయం గడిపేందుకు మీ ఇద్దరి మధ్య బలాన్ని మరింతగా పెంచేందుకు ఇది చక్కటి మార్గం.పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు తల్లి పాలు పట్టడం ద్వారా బిడ్డ యొక్క ఆరోగ్యం జీవితాంతం బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: