ఏపీ వైద్యారోగ్య మంత్రి విడదల రజని.. దేశంలోనే నెంబర్ వన్ అవార్డు అందుకున్నారు. అంటే ఆమె నెంబర్ వన్‌ గా నిలిచారని కాదు.. ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. ఏ విషయంలో అంటారా.. ప్రజల హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌లో దేశంలోనే ఏపీ రాష్ట్రం  ప్రధమ స్ధానంలో నిలిచింది. ఇందుకు సంబంధించిన అవార్డును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఇటీవల దిల్లీ వెళ్లి అందుకున్నారు.


అవార్డు అందుకున్న విడదల రజినిని, ఆ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. ద ఎకనమిక్‌ టైమ్స్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన డిజిటెక్‌ కాన్‌క్లేవ్‌ 2022లో ఈ అవార్డును ప్రకటించారు. మంత్రి రజని ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి వచ్చిన అవార్డును  అందుకున్నారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంను కలిసిన మంత్రి రజిని... రాష్ట్రానికి వచ్చిన అవార్డును చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: