సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని ఆ పార్టీ కార్యకర్త తనను మోసం చేశాడని విజయవాడ పాయకాపురం సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పింఛన్ పేరు చెప్పి తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె ఆరోపణలు చేసింది. కొన్నేళ్ల క్రితం తన భర్త చనిపోయాడని.... కూతురుకు పెళ్లి చేయగా... కుమారుడు హైదరాబాద్ లో ఉద్యోగరిత్యా ఉండటంతో తాను విజయవాడలో ఉంటున్నానని ఆమె పేర్కొంది. 
 
జనసేన పార్టీ కార్యకర్త శ్యాంసన్ పవన్‌ కళ్యాణ్ ఒంటరి వృద్ధులకు నెలకు పదివేల చొప్పున పింఛన్‌ ఇస్తున్నాడని తనను నమ్మించి మోసం చేశాడని.... తనకు పింఛన్ వచ్చిందని సంతకాలు చేయించుకున్నాడని.... ఆరు నెలల తర్వాత ఇల్లు తనదేనంటూ అమ్మకానికి పెట్టాడని వృద్ధురాలు చెప్పింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: