దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు మిడతల దండు చుక్కలు చూపిస్తుంది. ఢిల్లీ నగరంపై పెద్ద ఎత్తున మిడతల దండు దాడి చేసింది. దీనితో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాణా సంచాతో పాటుగా డప్పు మోగించాలి అని ప్రజలకు సూచనలు చేసారు. ప్రజలకు నిన్న సాయంత్రం నుంచే మిడతలు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఇక టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఇంటి పై కూడా మిడతల దండు దాడి చేసింది. ఈ వీడియో ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మా ఇంటిపై మిడతల దాడి’ అని సెహ్వాగ్ ఈ వీడియో క్యాప్షన్ యాడ్ చేసాడు. సెహ్వాగ్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Locust Attack pic.twitter.com/qDt4iJIwIq
— virender sehwag (@virendersehwag) June 27, 2020