ఈనెల 27న భారత్ బంద్ కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి, మోదీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు నిరసనగా బంద్ లో పాల్గొనాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. మోదీ పాలనకు వ్యతిరేకంగా ఈనెల 20నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీజేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణలో సైతం పలు కార్యక్రమాలు జరగనున్నాయి, ఈనెల 22న ఇందిరా పార్క్ వద్ద మహాదర్నా, 27న భారత్ బంద్, అక్టోబర్ 5న పోడు రైతులకు మద్దతుగా 400 కి మీ మేర రాస్తారోకోలు చేస్తున్నారు. మార్ప పక్క కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై గత కొద్ది నెలలుగా పోరాడుతున్న రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన ఉద్ధృతం చేసేందుకు నిర్ణయించింది, ఇందులో భాగంగా సెప్టెంబర్ 25న భారత్ బంద్కు పిలుపునిచ్చింది. కొద్ది రోజుల క్రితం యూపీలోని ముజఫర్నగర్లో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.