ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే ఉంచాల‌ని.. పేరు ఏదైనా పెట్టుకోండి అని అభివృద్ధి చేయాలి అని టీజీ వెంక‌టేష్ డిమాండ్ చేసారు. ఏపీ సీఎం  గందరగోళంలో పరిపాలన చేస్తే రాష్ట్రం సవ్యంగా ఉండదు అని తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ప్రస్తుత పరిస్థితి ఆలూ లేదు సోలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా క‌ర్నూలులో సమ్మర్ లేదా వింటర్ క్యాపిటల్ చేయాలని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని టీజీ వెంకటేష్  వివ‌రించారు.  

అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధాని ఉండేదని.. మా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీ‌కృష్ణ క‌మిటీకి తెలియ‌జేసినట్టు చెప్పారు.  వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తర్వాత హైకోర్టు కోసం ప్రయత్నం చేయాల‌ని  లేకపోతే రెండూ పోతాయని వెల్లడించారు. వైజాగ్ లో సెక్రటేరియట్ పెడితే మాకు దూరం అవుతుంద‌ని, క‌ర్నూలులో కూడా మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. రైతులు, భూములు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాలని,  మూడు రాజధానులపై మళ్లీ చట్టం చేసి కోర్టుకు వెళ్తే ఎలాంటి ప్రయోజనం చేకూర‌ద‌ని స్ప‌ష్టం చేశారు టీజీ వెంక‌టేష్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: