భారత దేశంలో ఈ మద్య స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోవడం ఎన్నో కంపెనీల కొత్త ఫీచర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా దేశ్కా స్మార్ట్ఫోన్' అంటూ భారత మార్కెట్లోకి షియోమి సంస్థ ప్రవేశపెట్టిన రెడ్మీ 5ఏ స్మార్ట్ఫోన్ వచ్చిది. ఆకట్టుకునే ఫీచర్లతో, అందుబాటు ధరతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ స్మార్ట్ఫోన్ తొలిసేల్ డిసెంబర్ 7న మధ్యాహ్నం 12 గం.లకు ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్ స్టోర్లో ప్రారంభం కానుంది.
దీని గురించి ప్రత్యేకంగా రెడ్మీ ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు కూడా చేసింది. ఎంఐ వినియోగదారులకు బహుమతి రూపంలో రూ.500కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వనున్నట్లు నిర్ణయం తీసుకుని, తొలి 50లక్షల రెడ్మి 5ఏ(2జీబీ 16జీబీ)ను రూ.4,999కే అందించనున్నట్లు రెడ్మీ ఇండియా ప్రకటించింది.
రెడ్మీ 5ఏ ఫీచర్లు:
5 అంగుళాల హెచ్డీ తాకే తెర
స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్
2జీబీ ర్యామ్
16జీబీ అంతర్గత మెమొరీ, 128జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం
5 ఎంపీ, 13 ఎంపీ ముందు వెనుక కెమెరాలు
ఆండ్రాయిడ్ నోగట్, ఎంఐయూఐ 9 వెర్షన్
3000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం