అమ్మాయిలను లైంగికంగా వాడుకునేందుకు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి తీరా కోరికలు తీరాక వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్ళైన ఓ వ్యక్తి యువతికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.. తీరా చూస్తే ఆమెను మళ్లీ ఇంటికి పంపించాడు.. జరిగిన విషయాన్ని తల్లి దండ్రులకు చెప్పింది.

వివరాల్లోకి వెళితే..వివాహితుడు మాయమాటలతో బాలికను మభ్యపెట్టి పెళ్లి చేసుకుని, లైంగికదాడి చేసిన ఘటనపై కొల్లూరు పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని దోనేపూడి శివారు గ్రామానికి చెందిన బాలిక భట్టిప్రోలులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లల తండ్రయిన 35 ఏళ్ల కూచిపూడి శ్రీను కొన్నేళ్లగా ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆకట్టుకున్నాడు. శ్రీనుతో తమ కుమార్తె మాట్లాడటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు.

అయితే , కలుసుకోవడం వీలుపడక పోవడంతో, కొంతకాలంగా ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకొనే వాళ్ళు..ముందుగా వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండాలని బాలికకు చెప్పి ఈనెల 12 తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెను తీసుకుని దోనేపూడిలోని తమ బంధువుల ఇంటికి, అక్కడ నుంచి విజయవాడ తీసుకెళ్లాడు. ముందుగానే అద్దెకు తీసుకున్న గదిలో మూడురోజులు బాలికతో ఉన్న శ్రీను లైంగికదాడి చేయబోగా ఆమె అడ్డుకుంది..

తర్వాత అతని కోరిక తీర్చుకునేందుకు మెడలో తాళి కట్టాడు..ఆపై తన ను ఇంటికి తీసుకెళ్ళి బలవంతంగా లైంగిక దాడి చేశాడు.కిరాయికి కారు మాట్లాడి బాలికను ఒంటరిగా ఇంటికి పంపించాడు. అనంతరం పూర్తి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికతో కొల్లూరు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. బాధిత యువతి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: