టీడీపీ అధినేత చంద్ర‌బాబు  అలా ప్ర‌క‌ట‌న చేశారో లేదో.. ఇలా పార్టీ పుంజుకుంది. ఇప్పుడు ఎటు చూసినా.. టీడీపీలో జోష్ క‌నిపి స్తోంది. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 శాతం సీట్ల‌ను యువ‌త‌కు ఇస్తామ‌ని చెఉప్పారు. అంటే.. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 70 స్థానాల‌ను యువ‌త‌కు ఇస్తున్నార‌ని తెలుస్తోంది. పోనీ.. వార‌సుల‌ను తీసేసినా.. దాదాపు 40 స్థానాల్లో కొత్త ముఖాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. అంతేకాదు.. పార్టిని న‌డిపించి.. గెలిపించే బాధ్య‌త‌ల‌ను కూడా వారికే అప్ప‌గిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న రెండో రోజు కూడా ఉద్ఘాటించారు. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న 33శాతం ప‌ద‌వులు.. యువ‌త‌కు ఇస్తాన‌ని చెప్పారు. కానీ, అప్ప‌ట్లో ఇవ్వ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు చేసిన ప్ర‌క‌ట‌న‌పైనా.. కొంత అనుమానాలు ఉన్న‌ప్ప‌టికీ.. రెండో రోజు కూడా చంద్ర‌బాబు ఇదే ప్ర‌క‌ట‌న‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్ప‌డంతో అన్ని జిల్లాల్లోనూ.. యువ‌త  సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా పుంజుకుం టున్నారు. పార్టీ త‌ర‌ఫున ఎలాంటి పిలుపు ఇచ్చినే.. చేంసేందుకు.. ముందుకు వ‌స్తామ‌ని యువ‌త చెబుతున్నారు. ``పార్టీలో 20 ఏళ్లుగా ప‌నిచేస్తున్నాను.. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి గుర్తింపు లేదు. ఇప్పుడు చంద్ర‌బాబు గుర్తిస్తామ‌ని చెబుతున్నారు. కాబ‌ట్టి సంతోషంగా ఉంది. పార్టీఇ అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు శాయ‌శ‌క్తులా ప‌నిచేస్తా`` అని అనంత‌పురం జిల్లాకు చెందిన మైనార్టీ నేత ఒక‌రు చెప్పారు. ఇదే త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌లు.. అన్ని జిల్లాల  నుంచి కూడా వినిపిస్తున్నాయి.

అంతేకాదు.. మ‌రికొంద‌రు అయితే.. చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిని చేసేందుకు తాము ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని.. చెబుతు న్నారు. ``యువ‌త‌ను ప్రోత్స‌హిస్తామ‌ని చెబుతున్నారు. మంచిదే. అయినా.. చంద్ర‌బాబును సీఎంను చేసుకునేందుకు మావం తు కృషి మాకు ఎప్పుడు ఉంటుంది`` అని ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన యువ‌త ప్ర‌క‌టిస్తున్నారు. ఇక‌, తూర్పుగోద‌వ‌రి, శ్రీకాకుళం, విజ‌య‌వాడ‌, క‌ర్నూలు, గుంటూరు.. ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోనూ.. యువ‌త చాలా ఉత్సాహంగా ముందుకు వ‌స్తున్నారు.

``చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిని చేయాల‌న్న క‌సి యువ‌త‌లో క‌నిపిస్తోంది. ఈ ప్ర‌భుత్వం పెట్టిన కేసుల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డ‌డం లేదు. మున్ముందు మ‌రింత గా కేసులు పెరుగుతతాయి. అయినా మేం సిద్ధ‌మే. చంద్ర‌బాబును సీఎం ను చేయాల‌నే ఒకే ఒక ల‌క్ష్యంతో అంద‌రూ క‌లిసి ప‌నిచేస్తాం`` అని సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు వెల్ల‌డించారు. దీనిని బ‌ట్టి.. అన్ని జిల్లాల్లో చంద్ర‌బాబు వేసిన మంత్రం బాగానే ప‌నిచేస్తోంద‌ని అంటున్నారు సీనియ‌ర్లు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: