పసిడి ప్రియులకు భారీ షాక్.. గత పది రోజుల నుంచి పసిడి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే..ఆదివారం ధరలు కాస్త తక్కువగా నమోదు అయిన కూడా నేడు మార్కెట్ లో ధరలు మాత్రం పైకి కదిలాయి. ఇది మహిళలకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో మార్కెట్ లో బంగారం కొనెవాల్లు తక్కువ అయ్యారు.. బంగారం ధర పెరిగింది. పసిడి రేటు స్వల్పంగా పైకి కదిలింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. నిన్నటి ధరల లో ఎటువంటి మార్పు లేదు.. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం పసిడి ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి.


హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..ఈరోజు బంగారం  ధర స్వల్పంగా ఫైకి చేరింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరిగింది.. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 52,810కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ.10 పెరగడంతో రూ. 48,410కు చేరింది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే.. వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగింది. దాంతో వెండి  రూ. 74,700 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా అదే ధరలు నమోదు అవుతున్నాయి.


ఇకపోతే ఇవి మన దేశంలో ధరలు.. ఇక విదేశీ మార్కెట్ లో పసిడి ధరలు తగ్గితే.. వెండి కూడా అదే దారిలో నడిచింది..ఔన్స్‌కు 0.28 శాతం దిగి వచ్చింది. దాంతో బంగారం ధర ఔన్స్‌కు 1979 డాలర్లకు చేరింది. బంగారం తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.83 శాతం తగ్గుదలతో 25.94 డాలర్లకు దిగివచ్చింది. కాగా బంగారు ధరల పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు మొదలగు పలు అంశాలు మార్కెట్ లో పసిడి ధరలపై ప్రభవాన్ని చూపిస్తున్నాయి. ఇకపోతే రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: