గత 20 సంవత్సరాలుగా చైనా, జపాన్, అమెరికా దేశాల్లో అమలు చేస్తున్న హైడ్రోజన్ థెరపీని హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మెడిలైట్ హెల్త్కేర్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఆక్స్ఫర్డ్ సహా అనేక విశ్వ విద్యాలయాలు, ప్రయివేట్ సంస్థల పరిశోధనల్లో హైడ్రోజన్ థెరపీలో ఇచ్చే అల్కలైన్ హైడ్రోజన్ వాటర్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెంచడమే కాకండా దెబ్బతిన్న కణాల పునరుద్ధరణకు సహాయపడుతుందని వెళ్లడయింది.
ఇక 2016 నుంచి మెడిలైట్ హెల్తెకేర్ సంస్థ నగరంలోని చాలా ప్రాంతాలకు అల్కలైన్ హైడ్రోజన్ రిచ్ వాటర్ను సరఫరా చేస్తోంది. ఆసుపత్రులు, గృహ అవసరాలకు అనుగుణంగా 20 లీటర్ల క్యాన్లలో ఈ వాటర్ను సరఫరా చేస్తోంది. ఈ నీటిని తాగిన వాళ్లలో ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉండటమే కాకుండా.. రోగనిరోధక శక్తి పెరుగుతుందని మెడిలైట్ హెల్త్కేర్ సంస్థ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెబుతున్నారుఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్ విటమిన్ 'సి' కంటే 188 రెట్లు అధిక ప్రయోజనాలు చేకూరుస్తుందని ఆక్స్ఫార్డ్ యూనివర్సిటీ వెల్లడించింది.
ఈ నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్తో పాటు హైడ్రోజన్ వాయువు విడుదల అవుతుంది. ఆ నీటిని తాగడం ద్వారా రక్తం లోకి హైడ్రోజన్ త్వరగా కలిసి పోయి కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది. అందువల్ల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారి ఊపిరితిత్తులను బాగా దెబ్బతీస్తోంది. కణజాల వ్యవస్థను పాడు చేస్తుంది. దీంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అల్కలైన్ హైడ్రోజన్ వాటర్ తీసుకోవడం ద్వారా శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగి ఊపిరితిత్తుల వాపు తగ్గుతుంది. అలాగే కణాల క్షీణత కూడా అదుపులో ఉంటుందని డాక్టర్లు తెలుపుతున్నారు.