అయితే మీ అందరికి తెలియని విషయం ఏంటంటే అరటిపండును పెరుగుతో పాటు కలిపి తింటే చాలా మంచిది. అది కూడా ఉదయం పూట తింటే ఆరోగ్యానికి మరి మంచిది. పెరుగులో కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే అరటిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ లభిస్తాయి.
ఉదయం పూట టిఫిన్ కింద పెరుగు, అరటి పండు తీసుకోవడం వలన ఎముకలు బలంగా మారతాయి. అంతేకాకుండా రెండు కలిపి తినడం వలన బరువు కూడా తగ్గుతారు. ఎలాగంటే అరటి పండులో ఫైబర్ శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది.
అంతే కాకుండా ఇవి రెండు కలిపి తినడం వలన ఎక్కువగా ఆకలి వేయదు. అలాగే అరటిపండు అండ్ పెరుగు కలిపి తినడం వలన మలబద్దకం సమస్య తగ్గుతుంది. మరి మీరు కూడా ఒకసారి అరటిపండు అండ్ పెరుగు కాంబినేషన్ ట్రై చేసి చూడండి. మీరు ఒక విషయంలో మాత్రం చాలా శ్రద్ద వహించాలి అదేంటంటేఏ పని మొదలుపెట్టిన అది ఒకటి రెండు రోజులు చేసి ఆపేస్తే ఫలితం కనిపించదు. ఏ పని అయిన క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తేనే ఫలితం మంచిగా ఉంటుంది. !