పెరుగు లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వేడి తగ్గించడం లో మంచి ఔషధం అని నిపుణులు అంటున్నారు.వెంటనే శక్తిని ఇస్తుంది అందుకే పెరుగును తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎప్పుడూ పెరుగు తీసుకోవడం మంచిది కాదనే అపోహ కొందరిలో ఉంది. ముఖ్యంగా రాత్రి పూట పెరుగు తినకూడదని అంటున్నారు. మరి అందులో ఎంతవరకు నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం మినహా.. మధ్యాహ్నం.. రాత్రి పెరుగుతో అన్నం తినేస్తుంటారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా.. ఆకలికి సంతృప్తినిస్తుంది. అయితే రాత్రిపూట పెరుగు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. మరీ అలా రాత్రిళ్లు తిరగడం మంచిదేనా అని కొందరిలో సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అలాగే మన పెద్దలు కూడా అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. రాత్రిల్లు పెరుగు తినకండి మంచిది కాదని అంటారు. రాత్రి పూట తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే రాత్రి మజ్జిగను తీసుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.
పెరుగు, పాల ఉత్పత్తుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చని మరికొందరు చెబుతున్నారు..
పెరుగు వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
రోజూ కప్పు పెరుగు తింటే మనకు కావాల్సిన ప్రోటిన్ అందుతుంది..పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి చలవ చేయాలంటే పెరుగు తినాల్సిందే.పెరుగు అరుగదల సమస్యను నివారిస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పాల పదార్థాలు ఎక్కువగా తినేవారికి విటమిన్ బీ12 లభిస్తుంది.రాత్రిపూట తింటే కలిగే సమస్యలు..
రాత్రి పూట తినడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి..
దగ్గ, జలుబు సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు అసలు తినకూడదు. ఫ్రిజ్ లో పెట్టిన పెరుగు తింటే జలుబు చేసే అవకాశముంది. కాబట్టి బయట ఉంచే పెరుగు తినాలి. పెరుగు రాత్రిపూట తినడం వలన గొంతులో కఫం ఏర్పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.పెరుగులో చెక్కర, లేదా బ్లాక్ పెప్పర్ వేసుకొని రాత్రిళ్లు తింటే సులభంగా అరుగుతుంది.రాత్రి సమయంలో వేడి ఆహరంలో పెరుగు వేసుకొని తినకూడదు...పెరుగు కన్నా పలుచని మజ్జిగను చేసుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది..