టాలీవుడ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటగా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎంట్రీ ఇచ్చిన పవన్ ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని, ఆ తరువాత గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో కూడా మరొక రెండు సక్సెస్ లు అందుకున్నారు. అనంతరం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలిప్రేమ సినిమాతో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న పవన్, యువతలో గొప్ప క్రేజ్ దక్కించుకున్నారు.  
ఇక అక్కడి నుండి మరింతగా దూసుకెళ్లిన పవన్ కళ్యాణ్, కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుని టాలీవడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల రెండున్నరేళ్లుగా రాజకీయాల్లో బిజీ అయిన పవన్, మళ్ళి వకీల్ సాబ్ సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశానికి సిద్ధం అయ్యారు. ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు మరొకవైపు మంచి హృద్యమైన సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీలో కూడా నటిస్తున్నారు. ఇటీవల రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గజదొంగ పాత్రలో నటిస్తున్నట్లుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.  

ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది, దాని ప్రకారం ఈ సినిమా ద్వారా తొలిసారిగా పవన్ సరసన హీరోయిన్ గా ప్రముఖ స్టార్ నటి నయనతార నటిస్తున్నట్లు చెప్తున్నారు. వాస్తవానికి మరొక హీరోయిన్ ని ముందుగా దర్శకనిర్మాతలు అనుకున్నారని, అయితే ఆమెకు ప్రస్తుతం డేట్స్ ఖాళీ లేనందువలన ఆమె స్థానంలో నయనతారను తీసుకున్నట్లు టాక్. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ. ఎమ్. రత్నం ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ఒకవేళ నిజమే అయితే మాత్రం తొలిసారిగా పవన్, నయన్ ల జోడీని వెండితెర పై చూడవచ్చన్నమాట ......!!            

మరింత సమాచారం తెలుసుకోండి: