బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన హ్యాట్రిక్ తాజా చిత్రం అఖండ.. ముచ్చటగా మూడో సారి వీరిద్దరి కాంబినేషన్ భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రేక్షకులకు, అభిమానులకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పవచ్చు.. ఇక ఈ సినిమా థియేటర్లలో నే కాకుండా దేశ విదేశాలలో కూడా భారీ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా గుర్తింపు పొందడం గమనార్హం. బాలయ్య బాబు తన నటనతో మరోసారి విశ్వరూపం చూపించాడు అని చెప్పవచ్చు. అంతేకాదు బాలయ్య బాబు నటించిన ఈ అఖండ సినిమాను చూడడానికి కాశీ నుంచి అఘోరాలు సైతం థియేటర్లకు కదలి వచ్చారు.. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా..

ఇకపోతే తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ షేర్ చేసిన ఒక ట్వీట్ చాలా వైరల్ గా మారింది.. అదేమిటంటే కరోనా లో కూడా మేము ఏమాత్రం భయపడము అంటూ ప్రేక్షకులు ఓపెన్ గ్రౌండ్లో కొన్ని వందల మంది ఈ సినిమాను చూడడం గమనార్హం. ఇకపోతే గుంటూరు జిల్లాలో ఒక ఊరి ప్రజలు మొత్తం కలిసి ఓపెన్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన టీవీ లో అఖండ సినిమా వీక్షించారు. సినిమా చూస్తున్నంతసేపు ఒక జాతర లా జరిగింది అని అక్కడి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం. కనీవినీ ఎరుగని రీతిలో బాలయ్య సినిమాను గ్రామ ప్రజలంతా ఒకేసారి మూకుమ్మడిగా ఒకే కుటుంబంలా చూడడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


కరోనా టైం లో ఇలా అందరూ ఒకే దగ్గర మూకుమ్మడిగా సినిమా వీక్షించడం సరి కాదు అని ఎవరి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే అంటూ కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. ఇకపోతే ఈ గ్రామ ప్రజలు వీక్షిస్తున్న ఫొటోలు ఎస్.ఎస్ తమన్ షేర్ చేస్తూ ఇదే కదా మాస్ జాతర.. బ్లాక్ బాస్టర్ అఖండ అంటూ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త బాగా వైరల్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: