టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉప్పెన డైరెక్టర్ సానా బుచ్చి బాబు ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 1980 నేపథ్యంలో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి `పెద్ది` అనే టైటిల్ ని కూడా ఫైనల్ చేసిన దర్శకుడు ఓ విషయంలో బాగా ఇబ్బందులు పడుతున్నారట. కారణం ఈ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ ఆలోచన మారడమేనని సమాచారం తెలుస్తోంది. సినిమాలోని ఓ కీలక ఘట్టంలో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దివ్యాంగుడిగా కనిపించాలట. అది స్టోరీకి చాలా కీలకం. కానీ అలా కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నది జూనియర్ ఎన్టీఆర్ అనుమానం.ఈ విషయంలో తారక్ పునరాలోచనలో పడ్డారని అందువల్ల ఈ సినిమాని పక్కన పెట్టాలనే ఆలోచనలో తను లేడని చెబుతున్నారు. `ఉప్పెన`సినిమా విషయంలోనూ దర్శకుడు సానా బుచ్చిబాబు ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నారట. `ఉప్పెన` క్లైమాక్స్ చాలా మందిని కూడా పెద్ద షాక్ కు గురిచేసింది.



అయితే ఆ క్లైమాక్స్ ని మార్చేయమని చాలా మంది బుచ్చిబాబుపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారట. కానీ బుచ్చిబాబు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కూడా క్లైమాక్స్ ని మార్చనని పట్టబట్టడంతో మేకర్స్ అదే క్లైమాక్స్ తో సినిమాని రిలీజ్ చేశారు. ఆ తరువాత అదే సినిమాకు ప్రధానంగా మారి సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబెట్టింది. ఇప్పడు తన కలల ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలోనూ అలాంటి ఓ పాయింట్ అనేది సినిమా ఆలస్యానికి కారణంగా నిలుస్తోందని చెబుతున్నారు.అయితే డైరెక్టర్ మాత్రం ఆ పాయింట్ సినిమాకు చాలా కీలకం కావడంతో ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటున్నారట. మరి ఈ విషయంలో యంగ్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారు? .. ఎలా ముందుకు వెళతారన్నది ఇప్పడు చాలా ఆసక్తికరంగా మారింది. ఇమేజ్ ని పక్కన పెట్టి పైగా ఆర్ ఆర్ ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ఎన్టీఆర్ ఈ మూవీని ముందుకు తీసుకెళతారా? లేదనే ఎక్కువగా సమాచారం తెలుస్తుంది. ఇక దీంతో ఈ సినిమా బుచ్చిబాబుకి కల గానే మిగిలిపోయేట్టు ఉందని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: