పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి తీస్తున్న తాజా సినిమా హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో మంచి సక్సెస్ లు సొంతం చేసుకుని కెరీర్ పరంగా మంచి జోష్ తో దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్, ఈ హరిహర వీరమల్లు మూవీ తో కూడా మరొక సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటోంది యూనిట్.

క్రిష్ ఈ సినిమాని ఎంతో జాగ్రత్తగా తీస్తున్నారని, ముఖ్యంగా కథ కథనాలు పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటాయని, ఇక వీరమల్లు పాత్రలో పవన్ పెర్ఫార్మన్స్ అయితే అదరహో అనే రేంజ్ లో ఉండనున్నట్లు టాక్. అలానే తన పాత్ర కోసం ఇటీవల ప్రత్యేకంగా పలు యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ తీసుకున్న పవన్ కళ్యాణ్, శారీరకంగా కూడా పలు కసరత్తులు చేసారని, అలానే నిధి అగర్వాల్ పాత్ర కూడా అదిరిపోతుందని సమాచారం. సినిమా కోసం మెగా సూర్య ప్రొడక్షన్స్ అధినేత నిర్మాత ఏ ఎం రత్నం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదని అంటున్నారు.

ఆకట్టుకునే కథాంశంతో పీరియాడికల్ డ్రామా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే యాభై శాతం వరకు షూట్ జరుపుకోగా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభించనుండగా మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా రిలీజ్ తరువాత హరిహర వీరమల్లు పెద్ద సక్సెస్ కొడితే పవన్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వచ్చినట్లే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: