శ్రీనిధి శెట్టి ఇటీవల ఈమె  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో హీరో యష్ సరసన నటించింది శ్రీనిధి. అయితే ఈ సినిమాలో ఆమె నటన గాను మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుసగా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి. 

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి శెట్టి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.కాగా  సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఎలా ఇచ్చారు అని అడగగా.. నేను మిస్ దివా ఇండియా పోటిల్లో కిరీటం గెలుచుకున్న తరువాత అందుకు సంబందించిన ఫోటోలు అనేక పత్రికల్లో రావడంతో ఆ ఫోటోలను చూసిన డైరెక్టర్ ప్రశాంతి నిన్న ఆడిషన్స్ కు పిలిచారు. ఇదిలావుంటే నా ఆడిషన్స్ లో నా పర్ఫామెన్స్ వచ్చి నన్ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు అని తెలిపింది శ్రీనిధి శెట్టి. ఇక దీని అనంతరం కేజిఎఫ్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారా అని అడగగా.. అసలు అనుకోలేదు..

సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరు ఊహించలేదు.అయితే కానీ ఈ సినిమా విడుదలైన తర్వాతే తెలిసింది మేము ఎంత పెద్ద హిట్ సాధించాము తెలిపింది శ్రీనిధి. ఇకపోతే మీరు తెలుగు సినిమాలో చూస్తారా? ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ తెలుగు సినిమాలు చూశారు అని అడగగా.. అవును నేను టాలీవుడ్ సినిమాలు చూస్తాను. అయితే నిజానికి నేను సినిమా పిచ్చిదాన్ని.. అన్ని భాషల్లో సినిమాలు చూస్తాను. కాగా తెలుగులో నేను చూసిన చివరి సినిమా సర్కారు వారి పాట అని తెలిపింది శ్రీనిధి శెట్టి.ఇదిలావుంటే  తదుపరి సినిమాల గురించి ప్రశ్నించగా.. చాలా ఆఫర్లు వచ్చాయి కానీ అవన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి.ఇకపోతే  ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టు ఇంకా ఓకే కాలేదు అని తెలిపింది శ్రీనిధి శెట్టి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: