ఇకపోతే ఇటీవలే సుడిగాలి సుదీర్ ఈటివి నుంచి వదిలేశాడు. మొన్న యాంకర్ అనసూయ సైతం ఇదే పని చేసింది. అంతేకాదు జబర్దస్త్ లో చాలా అవమానాలు ఎదుర్కొన్న అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరోసారి సుడిగాలి సుదీర్, అనసూయ ఈటీవీ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈటీవీ మొదలుపెట్టి 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించబోతున్నారు. ఇందులో ఈటీవీ ని కాదని వెళ్లిపోయిన సుధీర్ అనసూయ కూడా కనిపిస్తున్నారు.
అయితే ఒకసారి బయటికి వెళ్ళిన వాళ్ళనీ ఈటీవీలో కి రానివ్వరు. అవినాష్ విషయంలో ఇదే జరిగింది. కానీ ఇప్పుడు సుదీర్ అనసూయను మాత్రం ఆహ్వానించారు. రూల్స్ పక్కనపెట్టి కేవలం టిఆర్పి రేటింగ్ కోసం వీళ్లను పిలిచారు అంటూమల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రశ్నిస్తున్నారు ఎంతో మంది నెటిజన్లు. గతంలో ముక్కు అవినాష్ సహా ఎంతోమంది విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించిన మల్లెమాల యాజమాన్యం ఇక ఇప్పుడు అనసూయ సుధీర్ మాత్రం ఎందుకు మళ్ళీ పిలిచారు అంటూ సోషల్ మీడియా వేదికగా అడుగుతూ ఉండడం గమనార్హం. టిఆర్పి రేటింగ్ కోసం మరీ ఇంత దిగజారి పోతున్నారూ అంటూ మరికొంతమంది ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.