తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి విష్ణు విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విష్ణు విశాల్ ఇప్పటికే ఎన్నో మంచి విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి తమిళ నాట తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే విష్ణు విశాల్ కొన్ని రోజుల క్రితమే రవితేజ సమర్పణ లో విడుదల అయిన "ఎఫ్ ఐ ఆర్" అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విష్ణు విశాల్ "మట్టి కుస్తీ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఐశ్వర్య లక్ష్మి విష్ణు విశాల్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , చెల్లా అయ్యావు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా రవితేజ సమర్పిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా మట్టి కుస్తీ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ను రేపు రాత్రి 8 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. మట్టి కుస్తీ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: