టాలీవుడ్ బడానిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వారిసు.. దీనిని తెలుగులో వారసుడు పేరిట రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రూ. 250 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తుండగా హీరోయిన్ గా రష్మిక మందన్న అవకాశాన్ని దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు మొదట్లో తెలుగు నిర్మాతలు అడ్డుపడినప్పటికీ.. దిల్ రాజు తన నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్న నేపథ్యంలో ఎక్కువ థియేటర్లను ఈ సినిమాకి కేటాయించడం గమనార్హం.

అంతేకాదు అజిత్ కంటే విజయ్ గ్రేట్ అని చెప్పి అటు తమిళ్ తంబీలా ఆగ్రహానికి కూడా గురయ్యారు. నిన్నటికి నిన్న విజయ్ చాలా గ్రేట్ అని విజయ్ కోలీవుడ్ నెంబర్వన్ హీరో అని కూడా కామెంట్లు చేయడంతో ఈయనపై విమర్శలు మొదలయ్యాయి. అయితే అవన్నీ పట్టించుకోకుండా తన ప్రొడక్షన్ సంస్థను అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా విస్తరింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్లో సినిమాలను తెరకెక్కిస్తూ పారితోషకం పేరిట ఇతర భాష హీరోలను కూడా తనవైపు తిప్పుకుంటున్నాడు. ఈ సినిమాకు గాను హీరో విజయ్ కి ఏకంగా రూ.100 కోట్ల పారితోషకం ఇస్తున్నాడు దిల్ రాజు.

ఇకపోతే ఈ సినిమా ఆడియో లాంచ్ ను ఈనెల పూర్తి చేసిన విషయం తెలిసిందే. జనవరి ఒకటవ తేదీ సాయంత్రం 6:30 గంటలకు సన్ టీవీలో కూడా ప్రసారం కాబోతోంది. ఇదిలా ఉండగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 9 లేదా 10వ తేదీ జరిపించాలని నిర్మాత దిల్ రాజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఏ మేరకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: