రాజా రాణి.. ఈ సినిమా పేరు వినిపించింది అంటే చాలు యూత్ అందరిలో  కొత్త ఊపిరి నిండి పోయిందేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక అద్భుతమైన లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్నో ఏళ్ళు గడుస్తుంది. ఇప్పటికే ప్రేక్షకులు ఈ సినిమాను చూసే ఉంటారు. కానీ ఇప్పుడు టీవీలో వస్తున్న కూడా అన్ని పనులను మానుకొని రాజారాణి సినిమా చూడడానికి ఎక్కువగా ఇష్ట పడుతూ ఉంటారు సినీ ప్రేక్షకులు.


 అంతలా ఈ సినిమా ప్రతి ఒక ప్రేక్షకుడి మదికి కనెక్ట్ అయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా లోని రెండు లవ్ స్టోరీస్ కూడా ప్రేక్షకుల హృదయాలను మెలిపెట్టి కన్నీళ్లు తెప్పించాయి అని చెప్పాలి. అది సరేగాని ఇక ఇప్పుడు రాజారాణి సినిమా గురించి ఎందుకు చర్చ వచ్చింది? ఏదైనా విశేషం ఉందా అని అంటారా.. విశేషం ఉంది కాబట్టే ఈ సినిమా పేరు ప్రస్తుతం చర్చకు వచ్చింది. ఈ సినిమాలో నయనతార- జై జోడిగా నటించారు. వీరిద్దరి లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.


 ఇక ఇప్పుడు రాజారాణి సినిమా ప్రేక్షకుల ముందుకు ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ హిట్ జోడి మరోసారి ప్రేక్షకులను అలరించబోతుంది. జై పుట్టినరోజు సందర్భంగా నయనతార 75వ సినిమాలో జై హీరోగా నటిస్తున్నట్లు జి స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో ఇక వీరి జోడిని మళ్ళీ తెరపై చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందట. ఈ సినిమా అప్డేట్ తోనయనతార పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిందన్న ప్రచారానికి చెక్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: