విలక్షణ నటుడు శ్రీహరి చనిపోయి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంలో నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు డిస్కో శాంతి తన పిల్లలు శశాoక్ మేఘాంశ్ లతో కలిసి వచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీహరి గురించి తన గురించి అనేక ఆ శక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ శ్రీహరి చనిపోయిన తరువాత తన పిల్లలు తన దగ్గరకు వచ్చి ‘రేపటి పరిస్థితి ఏమిటమ్మా’ అని ఆడిగినప్పుడు తాను ఏమిచెప్పాలో తెలియక విపరీతమైన మానసిక క్షోభ అనుభవించాను అంటూ ఆనాటి విషయాలను గుర్తుకు చేసుకుంది డిస్కో శాంతి. 

ఇలా జరుగుతుందని శ్రీహరి కలలో కూడ అనుకుని ఉండడు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకుని మీకు ఏలోటు లేకుండా చూసుకుంటాను అని మాట ఇవ్వడమే కాకుండా తన ఇద్దరు కొడుకులను ఒకరిని డైరెక్టర్ గా మరొకరిని హీరోగా శ్రీహరి స్థాయికి తీసుకు వెళ్లాలని తన వంతు కృషి చేస్తున్న విషయం వివరించింది డిస్కో శాంతి. 

శ్రీహరి చనిపోవడానికి ముంబాయి లీలావతి హాస్పటల్ డాక్టర్ల నిర్లక్ష్యం అని చెపుతూ చాలామంది ఆ డాక్టర్ల పై కేసులు వేయమని ఎంతో బలవంత పెట్టినా పిల్లలతో ముంబాయిలోని ఆ కోర్టులు చుట్టూ తిరగలేక వారిని వదిలేసానని డిస్క్ శాంతి చెపుతోంది. శ్రీహరి రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు అందరూ తనతో బాగానే ఉండేవారని అయితే శ్రీహరి చనిపోయిన తరువాత చాలామంది దూరం అయిపోవడంతో మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకే చుట్టాలు స్నేహితులు మన చుట్టూ ఉంటారు అన్న నిజo తనకు అర్ధం అయింది అని షాకింగ్ కామెంట్స్ చేసింది డిస్కో శాంతి.

తన భర్త చనిపోయి రెండు సంవత్సరాలు దాటిపోయినా తన బావ శ్రీహరి ఫోటోతో ఇప్పటికీ మాట్లాడుతూ శ్రీహరి బోజనానికి వస్తాడని ఆశతో రాడని తెలిసినా ఎదురు చూస్తూ ఉంటానని తన బావ చాల మంచి మనసున్నోడు అంటూ శ్రీహరి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంది డిస్కో శాంతి..  



మరింత సమాచారం తెలుసుకోండి: