ఈటీవి ప్రచారం చేస్తున్న ప్రసారాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్’ కామెడీ షో. ఈ కామెడీ షోతో తెలుగు బుల్లి తెరపై ఇద్దరు హాట్ యాంకర్లు ఇంట్రడ్యూస్ అయ్యారు. మొదట అనసూయ యాంకర్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది..ఈ అమ్మడు ఎంతగా పాపులర్ అయ్యిందంటే జనాలు  జబర్దస్త్ షో అంటే యాంకర్ అనసూయ అనేంతలా పాపుల్ అయిపోయింది ఈ హాట్ భామ. తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ అమ్మడు ఆ షో నుంచి పక్కకు తప్పుకుంది. అప్పటికే అనసూయకు ఎక్కడ లేని ఇమేజ్ వచ్చిపడింది దీంతో కొన్ని ప్రైవేట్ ప్రోగ్రామస్, ఆడియో ఫంక్షన్లు, వేరే చానల్స్ లో యాంకరింగ్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది.

 

ఇక జబర్థస్త్ షో కి రష్మి వచ్చింది. రష్మి వచ్చి చాలా కాలం అయినా కొందరు అనసూయను మరిచిపోలేక పోతున్నారు. ఇకపోతే రష్మి కూడా ఈ మద్య బాగా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు కూడా వెండి తెరపై మెరవాలనుకుంటుంది..అంతే కాదు రెండు మూడు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఈ మద్య రష్మీ కూడా జబర్థస్త్ ప్రోగ్రామ్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అవన్నీ రూమర్లే అని ఖండంచింది ఈ హాట్ బ్యూటీ. జబర్దస్త్ లో అనసూయను మళ్లీ చూడాలనుకునే వారికి ఓ శుభవార్త..నిజమే బుల్లితెరపై మరోసారి జబర్దస్త్ లో అనసూయ కనిపించబోతుంది కాకపోతే రెగ్యూలర్ ప్రోగ్రామ్ కాదు..అనసూయ చేసిన పాత జబర్దస్త్ ఎపిసోట్లను కొత్తగా లాంచ్ అయిన ఈటీవీ ప్లస్ లో రీ టెలికాస్ట్ చేస్తున్నారు.

 

 చిట్టిపొట్టి డ్రెస్సులు వేస్తూ..హాట్ హాట్ గా చీరకట్టుతో అందరి మనసు దోచేసిన ఈ హాట్ యాంకర్ త్వరలో అందరి ని అలరించబోతుందట.  ఆకట్టుకునే అందం, చలకీతనం, మాటల్లో గడుసుతనంతో ఆమె యాంకరింగ్ రంగంలో దూసుకెళ్లడంతో పాటు సినిమాలు అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. ఇది అనసూయకు చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే సినిమాల్లోకి వెళుతున్న ఆ అమ్మడు ఈ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది...దీంతో తన అదృష్టానికి మరింత మురిసిపోతుంది ఈ భామ.అనసూయకు మళ్లీ అదృష్టం కలిసివచ్చిందా..?!!


మరింత సమాచారం తెలుసుకోండి: