దర్శకుడు ఏఎల్ విజయ్తో విడిపోయినప్పటి నుంచి నటి అమలాపాల్ కాస్త కష్టకాలాన్నే ఎదుర్కొంటున్నారు. అనుకున్న స్థాయిలో ఆమెకు సినిమా అవకాశాలు రాలేదు. అంతేకాకుండా ఉన్న అవకాశాలు కూడా తగ్గిపోయాయి. కొన్ని చిత్రాల్లో ఆమెకు బదులుగా వేరే హీరోయిన్ను ఎంచుకున్న సందర్భాలు ఉన్నాయి.
దీంతో ఆమె చిన్న బడ్జెట్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఆమె ‘ఆడై’ చిత్రంలో నటించారు. ఇందులో ఎక్కుపాళ్లు అందాలు ఆరబోసినట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల విజయ్ సేతుపతి చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసి.. మళ్లీ తొలగించారు.
దీంతో ఆమె ఆవేదనలో కూరుకుపోయారట. అదే సమయంలో ఏఎల్ విజయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల నడుమ ఈ అమ్మడు ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘నేను పోరాడుతా. జీవిస్తా. పెద్ద, చిన్న సమస్యలు వచ్చినా పర్వాలేదు. వాటిని నేను జయిస్తా. ఉన్నత స్థాయికి ఎదుగుతా.
సమస్యలన్నింటినీ తరిమేస్తా. నా బలాన్ని నేను నమ్ముతున్నా. స్వేచ్ఛ, సంతోషం చాలా ముఖ్యం. ధైర్యం ఉంటే పరాజయం చెందరు. ఇదే నేను నటిస్తున్న ‘ఆడై’ సినిమా కథ’ అని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో మనకు తెలియని మహిళల విషాద గాధ ఇది. ఆడవారిపై జరిగే అకృత్యాలను ఎండగట్టే విజయ గాధ ఇది అని కొంచెం ఎమోషనల్ గా చెప్పారు.