బాలకృష్ణ బి. గోపాల్ ల కాంబినేషన్ లో అనేక బ్లాక్ బష్టర్ హిట్స్ వచ్చాయి. ముఖ్యంగా ‘సమర సింహా రెడ్డి’ ‘నరసింహ నాయుడు’ మూవీలు అప్పట్లో బాలయ్య క్రేజ్ ను మరొక స్థాయికి తీసుకు వెళ్ళడమే కాకుండా అప్పటికే ఇండస్ట్రీని శాసిస్తున్న చిరంజీవిని ఖంగారు పెట్టేలా చేసాయి. అలాంటి గోపాల్ ఇప్పుడు బాలకృష్ణకు బహిరంగంగా క్షమార్పణలు చెప్పడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 


ఈమధ్య ప్రసారం అయిన ఒక టాక్ షోలో గోపాల్ మాట్లాడుతూ తాను అనాలోచితంగా తీసిన ఒక సినిమాలోని సీన్ వల్ల బాలయ్యకు కలిగిన అవమానం తనను ఇప్పటికీ బాదిస్తోంది అంటూ కామెంట్స్ చేసాడు. గతంలో తాను బాలకృష్ణతో తీసిన ‘ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు’ మూవీ డిజాస్ట‌ర్ గురించి మాట్లాడుతూ ఆ మూవీ ఫెయిల్ అయిన విషయం కంటే ఆ మూవీలోని ఒక సీన్ వల్ల బాలయ్యకు వచ్చిన పరాభవం గురించి మాట్లాడాడు. సాధారణంగా కమర్షియల్ హీరోల సినిమాలలో తొడ కొడితే కుర్చీ ఆహీరో ద‌గ్గ‌రకు రావ‌డడం అనే సీన్స్ ఉంటాయని అయితే తాను అత్యుత్సాహంతో బాలయ్య తొడకొడితే ఏకంగా రైలు వెన‌క్కి వెళ్లిపోయిన సీన్ క్రియేట్ చేసి బాలయ్య పై అప్పట్లో కామెడీ సెటైర్లు పడటానికి తాను కారణం అయ్యానని కామెంట్ చేసాడు. 

 

అంతేకాదు తన పై అన్ని సెటైర్లు పడుతున్నా అలాంటి సీన్ ఎందుకు క్రియేట్ చేసావు అంటూ బాలకృష్ణ ఇప్పటికీ తనను అడగక పోవడంతో బాలయ్యకు బహిరంగంగా క్షమార్పణ చెపుతున్నాను అంటూ గోపాల్ చేసిన కామెంట్స్ ఆ ఇంటర్వ్యూకు హైలెట్ గా మారింది. అందుకే కాబోలు బాలయ్య గోపాల్ క్షమార్పణలు మన్నించి తనతో మరో సినిమా చేసే అవకాశం ఇవ్వడమే కాకుండా ఆ మూవీ కథను రచయిత చిన్ని కృష్ణ చేత వ్రాయిస్తున్నాడు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే బాలయ్య బోయపాటిమూవీ తరువాత బాలయ్య గోపాల్ ల మూవీ ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: