డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రావణ లంక అనే ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు. ఒక సినిమా ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్లాలంటే దానికి టైటిల్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రేక్షకుల ఈజీగా కనెక్ట్ అయ్యే టైటిల్స్ సినిమాను ఆడియన్స్ కు చేరువ చేయటంలో ఉపయోగపడతాయి.
కె సీరీస్ మూవీ ఫ్యాక్టరి బ్యానర్ లో క్రిష్ సమర్పణలో మురళీ శర్మ, దేవ్గిల్ ప్రధానపాత్రలో బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రానికి రావణ లంక అనే టైటిల్ను ఖరారు చేశారు. క్యాచి గా వుండే ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం లో క్రిష్, అష్మిత, త్రిషలు జంటగా నటించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓక సాంగ్ మినహ షటింగ్ పూర్తిచేసకుని పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని ఆదివారం చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బి.ఎన్.ఎస్ రాజు మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా మా రావణ లంక చిత్రం రానుందని గర్వంగా చెప్తున్నాను. ఇలాంటి చిత్రాలకి స్క్రీన్ప్లేనే మెయిన్. మా సినిమాను కూడా ప్రతి ఒక్కరూ తల తిప్పకుండా చూసేంత థ్రిల్లింగ్ స్క్రీన్ప్లే తెరకెక్కించాము. మురళీ శర్మ గారు, దేవ్గిల్ గారు చాలా పెద్ద ఎస్పెట్ మాకు... అలాగే భద్రం, రచ్చరవి కామెడి టైమింగ్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. అలాగే కొత్త వారైనా క్రిష్ చాలా బాగా చేశాడు. అష్మిత, త్రిష లు ఈ థ్రిల్లింగ్ మూవీకి గ్లామర్ అందించారు.
ఉజ్వల్ అందించిన సంగీతానికి బిగ్బాస్ సీరీస్3 విజేత రాహుల్ సిప్లిగంజ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కుమారుడు కాలభైరవ వాయిస్ తోడై ఆడియోకి క్రేజ్ వచ్చింది. అతి త్వరలో ఈ ఆడియోని విడుదల చేస్తాము. ఈ చిత్రం తప్పకుండా అందర్ని ఆకట్టకుంటుందన్న నమ్మకం ఉంది. అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సమ్మర్ లో సినిమాను విడుదల చేస్తాము` అని తెలిపారు.