టాలీవుడ్ లోకి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మహేష్ బాబు తర్వాత హీరో సుధీర్ బాబు. కృష్ణ చిన్న కూతురు భర్త అయిన సుధీర్ బాబు ‘ఏం మాయ చేసావే’ మూవీలో సమంత సోదరుడిగా నటించాడు. ఆ తర్వాత శివ మనసులో శృతి (SMS) మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన హర్రర్, కామెడీ మూవీ ‘ప్రేమ కథాచిత్రమ్’ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మద్య బాలీవుడ్ లో భాగీ హిందీ మూవీలో కూడా నటించాడు. సమ్మోహనం తర్వాత సుదీర్ బాబు‘నన్ను దోచుకుందువటే’ చివరి మూవీగా నటించాడు. ప్రస్తుతం నాని, సుధీర్ బాబు నటిస్తున్న ‘వి’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'సమ్మోహనం' సినిమా చేస్తున్నప్పుడు, ఆయన నాకు 'వి' కథ చెప్పారు. కథ చాలా కొత్తగా .. విభిన్నంగా అనిపించింది... అందుకే ఈ మూవీలో నటించే ఛాన్స్ వస్తే బాగుంటుందని అనుకున్నాను. ఆ సమయంలో మరి ఎవరితో తీయాలని అడిగితే.. పవన్ - మహేశ్ బాబులతో చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. దాంతో నాకు ఉన్న ఆశలు ఆవిరైపోయాయి. తర్వాత ఇందులో ఒక పాత్రలో నాని.. మరో పాత్రలో నన్ను అడిగారు.. వెంటనే ఒప్పేసుకున్నాను.
నేను బలంగా కోరుకున్నాను కనుకనే, ఆ కథ నా దగ్గరికి వచ్చింది. ఈ సినిమా నాకు తప్పకుండా మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది అని చెప్పాడు. కొత్త ప్రాజెక్టుల విషయంలో నన్ను ఒప్పించడం చాలా కష్టమనే టాక్ ఇండస్ట్రీలో వుంది.. అవును నేను ఏ విషయంలో కాంప్రమైజ్ కాను.. నాకు నచ్చితేనే దాన్ని వదలను అన్నారు. ఏదో ఒక ప్రాజెక్టు వచ్చింది కదా అనీ, డబ్బులు వస్తాయి గదా అని సినిమాలు ఒప్పుకోను. ఒక సినిమాపై పెట్టే దృష్టే ఆ తరువాత సినిమా ఉండేలా చేస్తుంది అని చెప్పుకొచ్చాడు.