ఏపి ఎలక్షన్స్ ముందు.. రిజల్ట్స్ తర్వాత నానా హడావిడి చేసిన టాలీవుడ్ కమెడియన్ థర్టీ ఇయర్స్ పృథ్వి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లాడని చెప్పొచ్చు. జగన్ మీద తన అభిమానం ప్రేమ ఎప్పుడూ చూపిస్తూ అవతల వాళ్ళ మీద విమర్శలు చేస్తూ వచ్చిన పృథ్వి ఎస్వీబిసి చైర్మన్ గా పదవి దక్కించుకున్నాడు. అయితే మంచి పదవి వచ్చింది కదా కాస్త జాగ్రత్త పడాల్సిన టైం లో వెనుకనుండి వాటేసుకుందామనుకున్నా అన్న  ఆడియో టేప్ బయటకు రావడంతో మనవాడి పని అయిపొయింది. అది నా వాయిస్ కాడై వాదించినా సరే అతని మాటలు లెక్క చేయలేదు. ఫలితంగా ఎస్వీబిసి చైర్మన్ పదవి ఊడింది. 

 

ఇక సినిమా వాళ్ళ మీద కూడా తన కామెంట్స్ తో టార్గెట్ చేసిన పృథ్వి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అందుకే ఒక మెగా హీరో సినిమా నుండి అతన్ని తీసేశారు అన్న టాక్ కూడా వచ్చింది. వైఎస్సాఆర్ సిపి తరపున ప్రచారం చేయడం.. జగన్ సీఎం అవడం ఇక తనకు తిరుగు లేదు అనుకున్నాడేమో కానీ అతని మీద కాన్సెంట్రేట్ చేస్తే ఇలానే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. వెనుకనుండి వాటేసుకుందామనుకున్నా అంటూ తన ఆడియోని కావాలని టార్గెట్ చేస్తూ పృథ్వికి ఎక్కడ ఛాన్సులు లేకుండా చేశారు. ఈ ఇష్యూ అనంతరం తనని కావాలని టార్గెట్ చేశారని వాళ్ళ పని తర్వాత చెబుతానని సినిమా డైలాగులు కొట్టి సైలెంట్ అయ్యాడు పృథ్వి. 

 

మరి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి కొన్నాళ్లుగా మీడియా ముందుకు కూడా రాని  పృథ్వికి సినిమా అవకాశాలైనా వస్తున్నాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే చివరకు ఇలానే ఉంటుంది. కొన్నాళ్లుగా వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న పృథ్వి చేజేతులారా కెరియర్ పాడు చేసుకున్నాడని చెప్పొచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: