టాలీవుడ్ ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాని తర్వాత రాజకీయాల్లో బిజీ అయిన పవన్ మళ్లీ వకీల్ సాబ్ మూవీ ద్వారా ముఖానికి మేకప్ వేసుకున్నారు.  
ఇక ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక క్రిష్ సినిమా కూడా అతి త్వరలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కనుండగా దానిని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ రెండు సినిమాల అనంతరం తనకు గతంలో గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ ను అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేసిన హరీష్ శంకర్, ఈ సినిమాలో పవన్ కు ఆపోజిట్ గా నటించే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ని సెలెక్ట్ చేసినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ మూవీ ఆదిపురుష్ లో రావణాసురుడి పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్, ఈ సినిమా కథ, కథనాలు, అలానే తన పాత్ర ఎంతో నచ్చడంతో దీనిని ఒప్పుకున్నారని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే ఆ మూవీ యూనిట్ నుండి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: