సూపర్ స్టార్ మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు ఈ ఏడాది సంక్రాతి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక ప్రధానపాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి రత్నవేలు ఫోటోగ్రఫి అందించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి.

సూపర్ స్టార్ మహేష్ లోని కామెడీ యాంగిల్ ని చాలావరకు ఈ సినిమాలో వాడుకున్న దర్శకడు అనిల్ రావిపూడి, దీనిని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమా బుల్లితెరపై ప్రదర్శితమై భారీ స్థాయిలో టిఆర్పి రేటింగ్స్ కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాని ఇటీవల లాక్ డౌన్ అనంతరం తమిళ్ లో డబ్ చేసి తమిళనాడు లో రిలీజ్ చేయడం జరిగింది. గతంలో స్పైడర్ సినిమాని ద్విభాషా చిత్రంగా తమిళ్ లో కూడా రిలీజ్ చేసిన మహేష్ దాని ద్వారా మంచి పేరు దక్కించుకున్నారు.

ఇక మొదటి నుండి మహేష్ కి తమిళ్ లో కూడా భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం అక్కడ 50 % ఆక్యుపెన్సీ తో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కలెక్షన్ ని అందుకుంటున్నట్లు చెప్తున్నారు విశ్లేషకులు. ఈ సినిమా ఇప్పటికే తెలుగు లో రిలీజ్ అయి ఎన్నో రోజులు గడుస్తుండడం, అలానే ప్రస్తుతం కరోనా ప్రభావ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ మంచి రేంజ్ లో దీనికి కలెక్షన్ రావడం ఆనందదాయకం అని నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ నటించనున్న తదుపరి సినిమా సర్కారు వారి పాట సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకుడు.....!!

 

 




మరింత సమాచారం తెలుసుకోండి: