టాలీవుడ్  సీనియర్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ఏడాదిన్నర క్రితం సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. అంతకముందు తన కం బ్యాక్ మూవీ అయిన ఖైదీ నెంబర్ 150 ద్వారా సూపర్ డూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్, అనంతరం విడుదలైన సైరా నరసింహారెడ్డి మూవీ ద్వారా కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ఎలాగైనా మంచి హిట్ కొట్టి ఫ్యాన్స్ ని ఎంతో ఖుషి చేయాలని చేస్తున్న సినిమా ఆచార్య.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. తొలిసారిగా మెగాస్టార్, జూనియర్ మెగాస్టార్ ఇద్దరూ కలిసి నటిస్తుండడంతో అందరిలోనూ ఈ మూవీపై ఆకాశమే హద్డుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. చిరంజీవి ఇందులో ఒక మాజీ నక్సలైట్ పాత్రలో కనిపించనుండగా రామ్ చరణ్ ఆయనకు అనుచరుడిగా కనిపిస్తారని టాక్. మెగాస్టార్ కి జోడీగా కాజల్ నటిస్తున్న ఈ మూవీలో చరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. కాగా ఈ మూవీ ఈ ఏడాది వేసవి కానుకగా మే 13 న రిలీజ్ కానుంది.

అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, హీరోగా ఎంతో గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో ఒదిగి ఉండే మెగాస్టార్ చిరంజీవి వాడే ఫోన్ కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది అంటే నమ్మగలమా. కానీ ఇది నిజమని అంటున్నాయి కొన్ని టాలీవుడ్ వర్గాలు. మొదటి నుండి కూడా ఫోన్స్ పై పెద్దగా ఆసక్తిలేని మెగాస్టార్ చిరంజీవి, ఇదివరకు మాములు కీ పాడ్ ఫోన్ వాడేవారని, అయితే ఇటీవల సోష మీడియా లో అకౌంట్స్ ఓపెన్ చేసిన అనంతరం ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారని, ఎంత ఎదిగినప్పటికీ కూడా కేవలం మొబైల్ ఫోన్స్ విషయమై మాత్రమేకాక మిగతా ఇతర విషయాల్లో కూడా చిరంజీవి సాధారణ వ్యక్తి మాదిరిగా నార్మల్ లైఫ్ ని గడుపుతుంటారని పలువురు ఇండస్ట్రీ వర్గాల వారు చెప్తున్నారు. అందుకే కాబోలు ఆయన అంత గొప్ప మెగాస్టార్ అయ్యారు అని అంటున్నారు పలువురు ప్రేక్షకులు, విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: