యువ దర్శకుడు రమేష్
వర్మ తీస్తున్న ఈ యాక్షన్
థ్రిల్లర్ లో
రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా రాక్ స్టార్
దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని
మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ ఎల్ ఎస్ పి బ్యానర్స్ పై సత్యనారాయణ కోనేరు, రమేష్
వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ
మూవీ లో సీనియర్ యాక్టర్
అర్జున్ సర్జా విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం.
యువ భామలు
మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి
హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ
సినిమా షూటింగ్ ప్రస్తుతం
ఇటలీ లో జరుగుతోంది.
సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొంటున్న పలు ముఖ్య సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ ని కూడా యునిట్ చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ ఏమిటంటే అక్కడి షూటింగ్ స్పాట్ నుండి
రవితేజ తో పాటు యూనిట్ సభ్యులు దిగిన ఫొటోతో పాటు
సినిమా మేకింగ్ కి సంబందించిన మరొక ఫోటో ని యూనిట్ రిలీజ్ చేసింది. అవి సోషల్
మీడియా లో ఎంతో వైరల్ అవుతున్నాయి. వాటిని బట్టి చూస్తుంటే ఈ
మూవీ ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోందని, తప్పకుండా రిలీజ్ తరువాత ఈ ఖిలాడీ
మూవీ మాస్ రాజా ఖాతాతో మరొక సూపర్ హిట్ గా నిలవడం ఖాయం అని పలువురు ప్రేక్షకాభిమానులు తమ సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతున్నారు.....!!