కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా సినీ పరిశ్రమ మొత్తం మూలన పడింది. కరోనా వైరస్ ని కట్టడి చేసే క్రమంలో ప్రభుత్వాధికారులు లాక్డౌన్, కర్ఫ్యూలను విధించారు.ఇక ఈ క్రమంలో థియేటర్లు, షూటింగ్‌లు అన్నీ కూడా సుధీర్ఘ కాలం పాటు మూత పడ్డాయి. ఇక అయితే ఇప్పుడిప్పుడు మాత్రం మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్‌లు మొదలువుతున్నాయి. అలాగే మెల్లిమెల్లిగా స్టార్ హీరోలు సైతం సెట్స్ మీదకు వచ్చేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. అయితే ఇక ఈ క్రమంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ మేజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది.

ఇక మామూలుగా అయితే ఇప్పటికే మన సినిమాల జాతర నడవాల్సింది. అందుకే మే జూన్ జూలై నెలలో వరుసబెట్టి సినిమాలున్నాయి. కానీ ఇప్పుడు అన్నీ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఇందులో మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ మేజర్ సినిమా కూడా ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ముంబై ఉగ్రవాది దాడిలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ చూపించిన తెగువ గురించి అందరికీ తెలిసిందే. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఈ సూపర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అయితే ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మేజర్ సినిమా అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. ఇక ఇప్పటికే 80 శాతం మేజర్ షూటింగ్ పూర్తయిందని, ఇక మిగిలిన భాగం షూటింగ్‌ను జూలై నెలలో పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోందంటా.ఇక జూలై నెలలో సినిమా షూటింగ్ మొదలుపెట్టేందుకు అడివి శేష్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.ఇక ఇప్పటికే వదిలిన మేజర్ టీజర్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.ఇక పీవీపీ, జీఎంబీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మేజర్ సినిమాను శశి కిరణ్ తిక్కా తన స్టైల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మాత్రం ఎప్పటిలాగానే స్క్రిప్ట్ వర్క్ అందించింది అడివి శేష్ అన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: