2020 టోక్యో ఒలింపిక్స్ తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈసారి ఆరంభంలోనే మన భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. ఇక తాజాగా టోక్యోలో భారత పథకాల వేట మొదలైంది.వెయిట్ లిఫ్టింగ్ లో భారత క్రీడాకారిణి మీరాబాయ్ చాను రజత పథకాన్ని గెలుచుకుంది.మహిళల 49 కిలోల విభాగానికి గాను ఈమెకు రజత పతాకం దక్కింది. స్నాచ్ లో 87 కిలోలు ఎత్తిన మీరా..క్లీన్ అండ్ జర్క్ లో 115 కిలోలు ఎత్తింది.ఇక మొత్తంగా 202 కిలోల ఎత్తి తొలి పథకాన్ని సాధించింది.ఇక మీరాబాయ్ చాను సాధించిన విజయంతో దేశ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది.ఈ సందర్భంగా ఆమెకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు మీరాబాయ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు..మీరాబాయ్ సాధించిన విజయంపై ప్రశంశలు కురిపించారు.ఇక బాలకృష్ణ తన ఫేస్ బుక్ ద్వారా తన అభినందనలు తెలియజేశారు.'టోక్యో ఒలింపిక్స్ లో మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో కష్టపడి సిల్వర్ సాధించిన మీరాబాయ్ చానుకి హృదయ పూర్వక అభినందనలు.మనం ఎప్పటికీ ఎంతో ఆదరించే క్షణం.ఆమె అద్భుతమైన విజయంతో దేశాన్ని గర్వించేలా చేసింది.ఇంకా మరిన్ని పథకాలు మనకు రాబోతున్నాయి'అని తెలిపారు.

ఇక మరోవైపు మహేష్ బాబు సైతం స్పందిస్తూ.."భారతీయ జెండా ఎగరడం ప్రారంభమైంది.2020 టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించిన మీరాబాయ్ చానుకి నా తరపున పెద్ద అభినందనలు.యాక్షన్ గేమ్ ఇప్పుడే ప్రారంభమైందని' ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేసాడు మహేష్. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఇండస్ట్రీలో పునఃప్రారంభం అయ్యింది.పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇక అటు బాలయ్య 'అఖండ' అనే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: