సాహో సినిమా తో ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా అవతరించాడు దర్శకుడు సుజిత్ . ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా రన్ రాజా రన్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ వల్లనే ప్రభాస్ ఓ కొత్త దర్శకుడు అనే ఆలోచన లేకుండా సాహో సినిమాకు అవకాశం ఇచ్చాడు. అయితే భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కి విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ చేయవలసిన సినిమా ఇది కాదని భారీ అపవాదును మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సుజిత్ ఎక్కువగా నెగిటివ్ మార్కులు పొందాడు. ఈ సినిమా మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మర్చిపోయి తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టడానికి రంగం సిద్దం చేసుకోగా చిరంజీవి తో కమిటైన సినిమా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. దాంతో మరింత డిప్రెషన్లోకి వెళ్లిపోయిన సుజిత్ తాజాగా రామ్ చరణ్ తేజ్ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ చెప్పి ఒప్పించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది. అయితే సెప్టెంబర్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమా సుజిత్ సినిమా అని అంటున్నారు. సా తో ఒక్కసారిగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న సుజిత్ రామ్ చరణ్ తో చేయబోయే సినిమాతో మంచి పేరు తెచ్చుకుని మళ్లీ పూర్వవైభవం తెచ్చుకోవాలని చూస్తున్నాడు. మరి ఆయన ఆశలు నెరవేరతాయా చూడాలి. మరి తండ్రి తో సినిమా వర్క్ అవుట్ చేసుకొని సుజిత్ కొడుకుతో అయినా చేస్తాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: