జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ లని ఒకే వేదికపై చూడాలని అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నారు. కానీ అది కుదరడం లేదు.ఇక ఈ మధ్య కాలంలో ఈ బాబాయ్, అబ్బాయ్ లు ఒకే వేదికపై కనిపించకపోవడంతోఎన్టీఆర్, బాలయ్య మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎంట్రీ పై బాలయ్య చేసిన కామెంట్స్ అభిమానులను బాధ పెట్టాయి.గతంలో అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ మీట్ లో బాలయ్య, ఎన్టీఆర్ లు ఒకే వేదికపై కనిపించారు. మళ్ళీ ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి కనిపించనేలేదు.ఇక ఇదిలా ఉంటె తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరూ మళ్ళీ ఒకే వేదికపై కనిపిననున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ నటించిన 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త జోరుగా ప్రచారం సాగుతుండగా..ఈ వార్తకి సంబంధించి ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.అయితే గతంలో బాలకృష్ణ నటించిన సింహా సినిమా ఆడియో సక్సెస్ మీట్ కి అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ ఫంక్షన్ కి గెస్ట్ గా రావడం జరిగింది. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో దమ్ము అనే సినిమా చేసాడు తారక్.ఈ నేపథ్యంలో బోయపాటితో ఎన్టీఆర్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. కాబట్టి అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

 అంతేకాదు బాబాయ్ పై తనకు ఉండే ప్రేమను చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు ఎన్టీఆర్.ఇక ఈ నెల 27 వ తేదీన హైదరాబాద్ లో అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది.మరి ఎన్టీఆర్ కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే ఇక నందమూరి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.ఇక ద్వారకా క్రియేషన్స్ బ్యానర్  పై మిర్యాల రవీందర్ రెడ్డి అఖండ సినిమాని నిర్మిస్తున్నారు.దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా..యువ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: