దర్శకుడు
అనిల్ రావిపూడి సక్సెస్ మాత్రమే తన చిరునామాగా పెట్టుకొని ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేయగా అన్ని సినిమాలతో భారీ
సక్సెస్ ను సాధించి అగ్ర దర్శకుడు అయ్యేందుకు దూసుకుపోతున్నాడు. ఆయన తొలి చిత్రం పటాస్ ఆ తర్వాత వచ్చిన
రాజా ది గ్రేట్ ఆపైన ప్రేక్షకుల ముందుకు వచ్చిన F2 సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో ఆయనకు మహేష్ బాబు పిలిచి మరి
సినిమా అవకాశాన్ని ఇచ్చారు.
అలా సరిలేరు నీకెవ్వరు చిత్రం చేసిన
అనిల్ రావిపూడి ఆ చిత్రాన్ని విజయవంతం చేసి మహేష్ బాబు కెరీర్లో మరిచిపోలేని హిట్ సినిమాగా చేశాడు. ఏదేమైనా
అనిల్ రావిపూడి ఇప్పుడు అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం చేస్తున్న
f3 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.F2 చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోడగా ఈ సినిమాలో
వెంకటేష్ మరియు
వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ గా చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 24వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాతో మరోసారి
సక్సెస్ కొట్టాలని
అనిల్ రావిపూడి భావిస్తున్నాడు. ఇకపోతే ఈ
సినిమా ఇంకా విడుదల కాలేదు అప్పుడే తన తదుపరి
సినిమా గురించి ఆలోచిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు. మొన్నటి దాకా
అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నాడని వార్తలు రాగా ఇప్పుడు
బాలకృష్ణ తో ఆయన తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు వెల్లడించడం ఒక్కసారిగా అందరిలో ఎంతో కలవరం సృష్టించింది. హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఎంతో బాగుంటుంది. కొత్త కాంబినేషన్ వచ్చినా కూడా ప్రేక్షకులకు వెరైటీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హిట్ కాంబినేషన్ వదిలి కొత్త కాంబినేషన్ అయిన
బాలకృష్ణ తో
సినిమా చేయడం ఆయనకు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.