చిరు, నాగ్ కి పోటీగా విష్ణు.. ట్రోలర్లకి మళ్ళీ పని పెట్టాడుగా?

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా సినిమా ''జిన్నా''.  సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్ ఇంకా అలాగే సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని తెలుగు మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.'జిన్నా' సినిమాని అక్టోబర్ నెలలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ టీజర్ లో ప్రస్తావించారు. అయితే ఇప్పుడు విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర హీరోలతో మంచు విష్ణు బాక్సాఫీస్ వద్ద ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భావించాలి.


ఇదిలా ఉంటే 'జిన్నా' సినిమా రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమైన తర్వాత.. 'చిరంజీవి, నాగార్జునతో పోటీ పడుతున్న సన్నీలియోన్' అంటూ ఓ వర్గం ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. శృంగార తార సన్నీ నటించిన తెలుగు సినిమా ఈ దసరాకు విడుదల అవుతుంది అంటూ సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు.ఇద్దరు సీనియర్ హీరోల మధ్య విష్ణు నలిగిపోతారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి 'జిన్నా' సినిమా మంచు విష్ణు కు చాలా కీలమని చెప్పాలి. గత కొంతకాలంగా సరైన హిట్లు లేని హీరో.. చివరగా 'మోసగాళ్ళు' వంటి డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు పాయల్ కూడా ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. కాకపోతే సోలో డేట్ కి రిలీజ్ ప్లాన్స్ చేసుకోకుండా.. విష్ణు రెండు పెద్ద సినిమాల మధ్యలో థియేటర్లలోకి వదులుతున్నాడని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: