సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరియర్ లో 28 వ మూవీ లో హీరోbగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయ లేదు.

దానితో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా చిత్రీకరించబడుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ జరుపుతుంది. ఇది ఇలా ఉంటే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ ఈ మూవీ లో హీరోగా నటిస్తూ ఉండడం ... అలాగే అలా వైకుంఠపురంలో లాంటి భారీ బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడం ... ఈ రెండింటితో పాటు ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన అతడు ... ఖలేజా మూవీలు ప్రేక్షకుల నుండి  అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే వీరిద్దరి మూవీ లకు కూడా యూఎస్ఏ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కి యూఎస్ఏ లో అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కి 4  మిలియన్ లకు పైగా బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కనక నిజం అయితే నాన్ పాన్ ఇండియా మూవీ లో ఇదో సరికొత్త రికార్డ్ గా నిలిచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: