ఉప్పెన సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్.. తన మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరిన వైష్ణవ్ ఆ తర్వాత అలాంటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఇటీవల తన ఆశలన్నీ కూడా ఆదికేశవ సినిమా మీదే పెట్టుకోవడం జరిగింది.. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటించడం జరిగింది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.



నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్స్ ని కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. కానీ మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ రాలేదని కొన్ని సాంకేతిక కారణాలవల్ల మా ఆది కేశవ సినిమా ట్రైలర్ విడుదల వాయిదా వేయవలసి వచ్చింది అంటు తెలియజేశారు. అయితే చివరి నిమిషంలో ఇలా రద్దు చేసినందుకు మా మీడియా మిత్రులకు మరియు అభిమానులందరికీ కూడా క్షమాపణలు కోరుకుంటున్నాం అంటూ మేకర్స్ ఒక ట్విట్టర్ రూపంలో తెలియజేశారు.


అందుతున్న సమాచారం ప్రకారం వచ్చేవారం ఈ సినిమా ఈవెంట్ ఉండబోతుందని ఈ చిత్రంలో మలయాళం స్టార్ నటుడు జోజు జార్జ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ తేజ్ ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. శ్రీ లీల కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉండడం చేత ఈ సినిమా సినిమా ట్రైలర్ ఈవెంట్ ని క్యాన్సల్ చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీ లీల ప్రస్తుతం టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న తరుణంలో ఈమె కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొంటే కచ్చితంగా సినిమాకి హైపోస్తుందని చిత్ర బృందం భావించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: